
పశ్చిమ బెంగాల్లోని మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు మొదటి మూడు వారాల్లో 60 మంది నవజాత శిశువులు మృతి చెందారు.
మృతి చెందిన వారిలో 44 మంది ఇతర ఆసుపత్రుల నుండి రిఫర్ చేయబడిన వారు కాగా, కేవలం 16 మంది మాత్రమే ఎంఎంసీహెచ్లో జన్మించారు.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్షను ప్రారంభించిన ఆరోగ్య శాఖ, ఆసుపత్రి పనితీరుపై నివేదిక కోరడంతో పాటు గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.