
ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి 2,43,867 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 131.26 టీఎంసీలకు చేరుకోగా, గడచిన ఎనిమిది రోజుల్లోనే 88.19 టీఎంసీల వరద వచ్చిందని ఎస్ఈ వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
తుంగభద్ర ప్రాజెక్టుకు 1,00,750 క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాల నుంచి శ్రీశైలానికి 2,49,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.