
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి కారును గౌరారం పోలీస్స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్హౌస్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రజాస్వామ్యంలో కేసీఆర్ను కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.