
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, కోదండరాం బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగ ఐకాస ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీని నియమిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం స్వాగతించగా, సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.