
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణలో కూడా నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.