
ప్రకాశం జిల్లా చదలవాడలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి నారా లోకేశ్ ఆగస్టు 28న శంకుస్థాపన చేశారు.
ఈ హోటల్ 151 విలాసవంతమైన గదులు, 2,100 చదరపు మీటర్ల బ్యాంకెట్ హాళ్లు మరియు అత్యాధునిక సౌకర్యాలతో NH-16కు ఆనుకుని నిర్మితం కానుంది.
రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ భాగస్వామ్యంతో రానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు హాస్పిటాలిటీ మరియు టూరిజం రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.