
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మరణించారు.
ఆసుపత్రి మూడవ అంతస్తులోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో వెంటిలేటర్ పేలడంతో మంటలు చెలరేగి, మరో ఆరుగురు శిశువులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో వార్డులో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, గాయపడిన ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.