కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను పునర్వ్యవస్థీకరించి కొత్త ప్యానెల్ను ప్రకటించింది.
శశి శేఖర్ వేంపటి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ 18 మంది సభ్యుల నూతన బోర్డులో టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు స్థానం దక్కింది.
ఈ బోర్డులో ప్రీతి జింటా, పల్లవి జోషి, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి తదితర సినీ, కళారంగ ప్రముఖులకు కూడా చోటు లభించింది.