
హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో 160 డిటోనేటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల ఇదే ప్రాంతంలోని మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ ఘటన జరిగిన నేపథ్యంలో, తాజాగా డిటోనేటర్లు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనపై భద్రతా దళాలు అప్రమత్తమై, ఆయుధాల చోరీ కేసుతో వీటికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశాయి.