విజయవాడ కస్టోడియల్ డెత్ కేసులో ఏ4 నిందితుడు గులివిందల సురేష్ను సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో కాకుండా పాడుబడ్డ భవనంలో చనిపోయాడని, సీఐ నాగరాజు సహా ఇతర పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది.
మృతుడి ఆనవాళ్లు దొరకకుండా ఆధారాలను తొలగించి, శ్మశానవాటికలో దహనం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.