
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
ఆసిఫాబాద్, సిర్పూర్, రెబ్బెన, పెంచికల్పేట, కౌటాల మరియు కెరమెరి ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్సీ దిష్టిబొమ్మలను దహనం చేసి, ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దళిత ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్సీ మధుపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు.