
హైదరాబాద్లోని కాటేదాన్, బాలాపూర్ ప్రాంతాల్లో విషపూరిత రసాయనాలతో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న 13 యూనిట్లపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 25 టన్నుల కల్తీ మసాలా దినుసులను, 89 టన్నుల ముడిసరుకును స్వాధీనం చేసుకుని, రాహుల్ బాటీ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
దుస్తులకు వాడే రంగులు, టాల్కమ్ పౌడర్ కలిపి తయారు చేసిన ఈ మసాలాల వల్ల క్యాన్సర్, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.