హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం శుక్రవారం కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.