
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపించడంతో గవర్నర్ బాబ్ ఫెర్గుసన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఈ కార్చిచ్చు వల్ల సుమారు 600 భవనాలు దగ్ధమయ్యాయని, 2,50,000 ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని, 60,000 మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
మంటలను అదుపు చేసేందుకు కాలిఫోర్నియా నుంచి రప్పించిన బలగాలతో సహా మొత్తం 4,000 మంది సిబ్బంది శ్రమిస్తున్నారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.