
పాకిస్తాన్లోని న్యూ ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రధాన ద్వారం వద్ద అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో కారులో ఉన్న రెహ్మతుల్లా, అబ్దుల్ జబ్బార్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన వారిలో ఒకరికి డేరా ఘాజీ ఖాన్తో, మరొకరికి బలూచిస్థాన్లోని కోహ్లూ జిల్లా నేర చరిత్రతో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.