
శనివారం అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రభుత్వ శకటాల ప్రదర్శనను ప్రారంభించారు.
మధ్యాహ్నం నుంచి మల్కాపురం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లోని ప్రధాన రహదారుల మీదుగా ఈ శకటాల ప్రదర్శన కొనసాగింది.
ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన ఈ శకటాలను తిలకించేందుకు రాజధాని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.