
డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరాలపై సీబీఐ 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో ఆపరేషన్ చక్ర-VI పేరుతో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
బాధితులను నెలల తరబడి డిజిటల్గా బంధించి రూ. 42.36 కోట్లు వసూలు చేసిన ముఠాలకు చెందిన ముగ్గురు సూత్రధారులను సీబీఐ అరెస్ట్ చేసింది.
బిట్స్ పిలానీ కేసులో రూ. 7.67 కోట్లు, గుజరాత్ కేసులో రూ. 19.24 కోట్లు, కర్ణాటక కేసులో రూ. 15.45 కోట్లు బాధితుల నుంచి దోచుకున్నట్లు గుర్తించారు.