
జూన్ చివరి నాటికి దేశంలో టెలికాం చందాదారుల సంఖ్య 134.8 కోట్లకు చేరిందని, మే నెలతో పోలిస్తే 0.37% వృద్ధి నమోదైందని ట్రాయ్ తెలిపింది.
జూన్లో కొత్తగా చేరిన 62 లక్షల మంది చందాదారుల్లో 87% మంది ఎయిర్టెల్, జియో నెట్వర్క్లనే ఎంచుకున్నారు.
ఎయిర్టెల్ 31.63 లక్షల మందిని, రిలయన్స్ జియో 22.91 లక్షల మందిని కొత్తగా తమ ఖాతాదారుల జాబితాలో చేర్చుకున్నాయి.