
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన ఐపీఓ సైజును గతంలో అంచనా వేసిన రూ. 30,000 కోట్ల నుండి రూ. 25,000-27,000 కోట్లకు తగ్గించుకుంది.
కొందరు ఇన్వెస్టర్లు వాటా విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంతో, ఐపీఓలో విక్రయించే వాటా 6 శాతం నుండి 5.2-5.5 శాతానికి తగ్గింది.
షేర్ల ధరల శ్రేణిని కూడా గతంలో అనుకున్న రూ. 1,800 స్థాయి నుండి రూ. 1,700-1,800 స్థాయికి తగ్గించే అవకాశం ఉందని సమాచారం.