
తెలంగాణ రెవెన్యూ శాఖలో 22A నిషేధిత భూముల జాబితా పేరుతో జరుగుతున్న అవినీతిపై మాజీ మంత్రి హరీష్ రావు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి, వాటిని తొలగించేందుకు దళారులు మార్కెట్ విలువలో 30 శాతం వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
2023 డిసెంబర్ నుండి జరిగిన ఈ భూ లావాదేవీలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని, రెవెన్యూ మంత్రిని బర్తరఫ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.