విశాఖపట్నం జిల్లా భీమిలి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం హాస్టల్లో ఈ నెల 16న రాత్రి 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఘటన కలకలం రేపింది.
రాత్రి స్టడీ అవర్ ముగిసి విద్యార్థినులు నిద్రపోయిన తర్వాత, ఒక జడ వేసుకున్న బాలికల జుత్తును మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డారు.
హాస్టల్కు కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో బయటి వ్యక్తుల ప్రవేశంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, యాజమాన్యం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసింది.