
ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 92.04 టీఎంసీలకు చేరుకోగా, మంగళవారం సాయంత్రానికి ఇది 100 టీఎంసీలను దాటే అవకాశం ఉంది.
సోమవారం రాత్రి సమయానికి ప్రాజెక్టులోకి 1.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, జూరాల నుంచి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వద్ద నీటి మట్టం 855.10 అడుగులకు చేరిందని, మరో నాలుగు ఐదు రోజుల పాటు వరద ఉధృతి కొనసాగవచ్చని సీఈ కబీర్ బాషా తెలిపారు.