
ముడి సరుకుల ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా మారుతీ సుజుకీ తన కార్ల ధరలను రూ. 20,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
మే నెల తర్వాత కంపెనీ ధరలను పెంచడం ఇది మూడవసారి అని సంస్థ వెల్లడించింది.
పెరిగిన ధరలు సెప్టెంబర్ నెల నుంచే అమల్లోకి వస్తాయని మారుతీ సుజుకీ ఇండియా సోమవారం స్పష్టం చేసింది.