తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏనుగుల కదలికలను డ్రోన్ల సహాయంతో పర్యవేక్షించాలని, రాత్రివేళ ప్రజలను అప్రమత్తం చేసేందుకు మైకులు, మొబైల్ సందేశాలను వాడాలని అధికారులను ఆదేశించారు.
పంట నష్టంపై నివేదికలు అందిన వెంటనే అటవీశాఖ ద్వారా బాధితులకు తక్షణ పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.