
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్కు పూణెలో హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు.
అవార్డు స్వీకరించిన అనంతరం డోభాల్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అంటే అపరిమిత స్వేచ్ఛ కాదని, దేశం పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలని యువతకు సూచించారు.
భారత విదేశాంగ మరియు జాతీయ భద్రతా విధానాలను బలోపేతం చేయడంలో డోభాల్ పాత్ర కీలకమని అమిత్ షా ప్రశంసించారు.