
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన మెజెస్టర్ కారు ధరలను రూ.1.50 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ ధరల పెంపు సావీ 2డబ్ల్యుడీ వేరియంట్లకు వర్తించగా, ఎక్స్-షోరూమ్ ధర రూ.40.99 లక్షల నుండి రూ.42.49 లక్షలకు చేరింది.
టాప్ స్పెక్ సావీ 4డబ్ల్యుడీ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదని, దీని ధర రూ.44.99 లక్షల వద్దే కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.