
శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న కొత్త చిత్రానికి 'జార్జ్ క్రిష్' అని పేరు పెట్టారు.
ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.