
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ విన్ ఫాస్ట్ భారత్ కోసం ప్రత్యేకంగా రెండు కొత్త బడ్జెట్ ఈవీలను అభివృద్ధి చేస్తోంది.
భారత వినియోగదారుల కోసం రూ.10 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో VF X, VF Y కోడ్నేమ్లతో ఈ కార్లను తీసుకురానుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం తమిళనాడులోని తూత్తుకుడి తయారీ ప్లాంట్లో పెట్టుబడులతో పాటు దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.