
దేశీయ వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతోందని ఫిలిప్స్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఏఐ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గతంతో పోలిస్తే ఎక్కువ మంది రోగులకు సేవలు అందించగలుగుతున్నారు.
వైద్య సేవల్లో ఏఐ నాడిని పట్టుకోవడంతో రోగులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం మెరుగుపడిందని నివేదిక పేర్కొంది.