వర్షాకాలంలో తేమ, తడి వాతావరణం వల్ల ఆస్తమా, సీవోపీడీ, న్యూమోనియా వంటి శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని కామినేని హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు.
దగ్గు, జలుబు వంటి లక్షణాలు తగ్గకుండా కొనసాగితే, అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చునని, వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకుండా, ఇళ్లలో పరిశుభ్రత, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.