
తెలంగాణలో 3.42 కోట్ల మందికి రూ.14,800 కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 89 లక్షలుగా ఉన్న రేషన్ కార్డుల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం 2.80 కోట్లకు పెంచిందని మంత్రి వెల్లడించారు.
కొత్తగా 16 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.