బొల్లారం మద్రాస్ రెజిమెంట్లో చోరీకి గురైన ఆయుధాలు, బుల్లెట్లు, మ్యాగజైన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహబూబ్నగర్లోని ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నివాసంలో గురువారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులు, ఒక అధికారితో పాటు మాజీ ఆర్మీ అధికారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.