
అగస్త్య గ్రీన్ ఎనర్జీ సంస్థ కర్నూలులోని ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో రూ. 7,800 కోట్ల పెట్టుబడితో సోలార్ ప్లాంట్ను నిర్మించనున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రాజెక్టులో 12 గిగావాట్ల ఇంగట్, వేఫర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుండగా, దీని ద్వారా 3,500కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సోలార్ వాల్యూ చైన్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ఏయూజీ గ్రూప్ చైర్మన్ అనుభవ్ అగర్వాల్ తెలిపారు.