ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
వరద ఉధృతి పెరగడంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుత వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.