
జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 20వ ఏషియన్ గేమ్స్లో భారత క్రీడాకారుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు.
గేమ్స్ విలేజ్ బయట 2400 మంది క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన 40X8 అడుగుల కంటైనర్ గదుల్లో నలుగురు చొప్పున ఆటగాళ్లు బస చేయనున్నారు.
ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు, పాటియాల మరియు బెంగళూరులోని సాయ్ కేంద్రాల్లో ఏసీ, ఫ్రిజ్ వంటి సౌకర్యాలతో కూడిన నమూనా కంటైనర్లను సిద్ధం చేశారు.