ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబుపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రభుత్వం ఆయనను బాధ్యతల నుంచి తప్పిస్తూ, తక్షణమే రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పోలీస్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిపై ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.