
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల సహా 13 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉండగా, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.