
ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్, షేర్-ఎ పంజాబ్ టీ20 లీగ్లో మోహాలీ కింగ్స్పై 64 బంతుల్లో 173 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
ఈ ఇన్నింగ్స్లో నమన్ 16 ఫోర్లు, 12 సిక్సర్లతో విరుచుకుపడగా, అతని జట్టు అమృత్సర్ సూర్మాస్ నిర్ణీత 20 ఓవర్లలో 279 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ టోర్నీలో ఇప్పటికే ప్రభ్సిమ్రన్ సింగ్ రెండు శతకాలు సాధించగా, రమన్దీప్ సింగ్, అభిషేక్ శర్మ వంటి ఐపీఎల్ ఆటగాళ్లు కూడా రాణిస్తున్నారు.