
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలంపై బీసీసీఐ త్వరలో నిర్ణయం తీసుకోనుండగా, లక్ష్మణ్కు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది.
అగార్కర్ స్థానంలో జహీర్ ఖాన్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం, రోహిత్ శర్మ భవిష్యత్తు విషయంలో సెలక్షన్ కమిటీతో బోర్డుకు అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు భేటీ అయి అగార్కర్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.