తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 2న ఆకస్మిక దాడులు నిర్వహించారు.
అక్రమ ఆస్తుల కేసులో భాగంగా ఆయనకు చెందిన బ్యాంక్ లాకర్లు, నివాసాల్లో సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
15 ఏళ్ల తర్వాత టీటీడీలో జరిగిన ఈ ఏసీబీ దాడులు దేవస్థాన వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.