
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 77లోని సినిమా టికెట్ ధరల ఖరారుపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కొత్తగా చేర్చిన స్పెషల్ థియేటర్ కేటగిరీ నిబంధనల వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఛాంబర్ ఆందోళన చెందుతోంది.
ఈ జీవోను సమీక్షించాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన ఫిల్మ్ ఛాంబర్, అన్ని భాగస్వాములతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది.