
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రూ. 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్కు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు.
రవిశంకర్ గ్రూప్ మరియు రవిప్రియ హాస్పిటాలిటీస్ భాగస్వామ్యంతో ఒంగోలు పరిసరాల్లో ఈ తొలి 5 స్టార్ హోటల్ ఏర్పాటు కానుంది.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.