
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బుధవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఫిర్యాదు చేసింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల దాడి వీడియోలను, కేసీఆర్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ వెల్లడించారు.
అసెంబ్లీ లోపల జరిగిన అంశాలపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసిన గవర్నర్, బయట జరిగిన ఘటనలపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.