
ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో పెరుగుతున్న మానవ కార్యకలాపాల వల్ల ఖుంబు హిమానీనదం వేగంగా కరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
2023 వసంతకాలంలో బేస్ క్యాంప్లో విడుదలైన 8,49,174 మెగాజౌళ్ల వేడి, సుమారు 2,492 టన్నుల మంచును కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు.
1991 నుంచి 2023 మధ్య బేస్ క్యాంప్ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏటా 0.28 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.