
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాలను గరిష్ఠంగా 50 శాతానికి పెంచినప్పటికీ, జూలైతో ముగిసిన ఏడాది కాలంలో భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 20 శాతానికి చేరింది.
గత 12 నెలల కాలంలో భారత్ అమెరికాకు 8,850 కోట్ల డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేయగా, చైనాకు జరిగిన ఎగుమతులు 2,150 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 8,731 కోట్ల డాలర్ల ఎగుమతులు జరగ్గా, యూఏఈ 3,737 కోట్ల డాలర్లతో రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా నిలిచింది.