
ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన 'వైల్డ్బెర్రీస్' సంస్థ గిడ్డంగులు ధ్వంసమై 12 మంది మరణించగా, 39 మంది గాయపడ్డారు.
ఈ దాడుల వల్ల సంస్థ వ్యవస్థాపకురాలు టట్యానా కిమ్ వ్యాపార సామ్రాజ్యానికి భారీ నష్టం వాటిల్లిందని సమాచారం.
వైల్డ్బెర్రీస్ గిడ్డంగులు యుద్ధానికి అవసరమైన వస్తువులను సరఫరా చేస్తున్నాయని ఉక్రెయిన్ ఆరోపించగా, రష్యా ఆ వాదనను తిరస్కరించింది.