
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు.
దాదాపు 130 రోజుల పాటు భారీ ఎత్తున చిత్రీకరణ జరుపుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా గ్రాండ్గా విడుదల కానుంది.