
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత ప్రభుత్వ ప్రమేయం లేదని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిందని, హసీనా చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఆమోదించదని శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలిపారు.
రెండేళ్ల తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన హసీనా, బంగ్లాదేశ్లో ప్రస్తుత పాలనపై విమర్శలు చేస్తూ, త్వరలోనే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించారు.