
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా కోసం, మేకర్స్ దేశవ్యాప్త ప్రమోషన్లు మరియు మీడియా ఇంటర్వ్యూలతో భారీ హైప్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుండగా, తొలి రోజు రూ. 500 కోట్ల గ్రాస్ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గతంలో ప్రమోషన్లకు దూరంగా ఉన్న ప్రభాస్, ఈ పీరియాడిక్ డ్రామా కోసం స్వయంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొని పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రచారం చేయనున్నారు.