
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియను వేగవంతం చేస్తూ పోలింగ్ స్టేషన్ల ఖరారుకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈనెల 14 నాటికి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి, 16న రాజకీయ పక్షాలతో సమావేశమై, 19న తుది జాబితాను ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది.
పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈనెల 16 వరకు గడువు ఇస్తూ ఎన్నికల సంఘం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.